న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ప్రజలకు, దేశానికి ఎయిరిండియా సేవలు కావాలని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతి రాజు అన్నారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ... " ఎయిరిండియా ఉద్యోగులెవరికీ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రాదు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లాగా ఎయిరిండియాను కానివ్వం" అని తెలిపారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ నేతృత్వంలోని మంత్రివర్గ బృందం, ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలిస్తుందని, ఎంపీలు ఇతరులు ఎవరైనా ఇందుకు సలహాలు ఇవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు. అప్పుల్లో చిక్కుకున్న ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేసేందుకు జూన్ 28న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.