నేటితో ప్రగతి విద్యాసంస్థలపై ముగిసిన ఐటీ సోదాలు

SMTV Desk 2017-12-28 16:14:39  IT firms ending in pragathi academic institutions krishna dist avanigadda

అవనిగడ్డ, డిసెంబర్ 28 : నేటితో అవనిగడ్డలోని ప్రగతి విద్యాసంస్థలపై చేపట్టిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు ముగిశాయి. ఈ నెల 26 నుంచి నేటి వరకు కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రగతి విద్యాసంస్థలపై గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మూడు రోజుల పాటు సోదాలు చేపట్టారు. అయితే, దీనిపై వివరాలు వెల్లడించేందుకు అధికారులు విముఖత చూపించారు. మరోవైపు గత రెండు రోజులుగా తరగతులు లేకపోవడంతో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.