న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : నేటి మార్కెట్లో పసిడి ధర మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గరిష్ఠానికి చేరుకున్న బంగారు ధర రూ.175 పెరిగి 10 గ్రాములకు రూ.30,250 గా ఉంది. ఆభరణాల తయారీ దారుల నుండి అధికంగా డిమాండ్ పెరిగిపోవడం వల్ల ఈ ధర పెరిగినట్లు ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. ఇదే బాటలో వెండి కూడా పయనించింది. రూ.250 పెరగడంతో కేజీ వెండి ధర రూ.39,500కు చేరింది. అంతర్జాతీయంగా చూస్తే బంగారం ధర 0.33 శాతం, వెండి 0.54 శాతం పెరిగింది. కాగా బంగారం ధర పెరగడం వరుసగా ఇది ఐదో రోజు కావడం గమనార్హం.