కర్నూలు, డిసెంబర్ 28 : నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని రోడ్డులో అను ఇమ్మాన్యుయేల్ బీ న్యూ మొబైల్స్ షోరూంను ప్రారంభించేందుకు వచ్చి సందడి చేశారు. షోరూంలో జ్యోతి ప్రజ్వలన చేసి కొత్త మొబైల్స్ను వినియోగదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అను మాట్లాడుతూ...షోరూం ప్రారంభానికి ఇలా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్థ మరింత ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి రావడంతో, వారిని ఉద్దేశించి ఆమె పవన్కల్యాణ్తో "అజ్ఞాతవాసి" చిత్రంలో నటిస్తున్నానని ఈ చిత్రం సంక్రాంతి కానుక మీ ముందుకు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీ న్యూ మొబైల్ సంస్థ ఛైర్మన్ వైడీ బాలాజీ చౌదరితో పాటు సంస్థ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.