న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : కాంగ్రెస్ పార్టీ 133వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో కన్నుల పండుగగా జరిగాయి. కాగా ఈ వేడుకల్లో పార్టీ అధ్యక్షుని హోదాలో రాహుల్ గాంధీ తొలిసారి ఈ వేడుకలకు సారధ్యం వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఒక పునాది అయిన రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. అంతేకాకుండా బీజేపీ సీనియర్ నేతలు.. తమ ప్రకటనల వల్ల రాజ్యాంగం పైకి దాడికి దిగుతున్నారంటూ ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.