న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : ప్రముఖ అంతర్జాల సంస్థ ట్విట్టర్ ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా ఏయే అంశాలకు సంబంధించిన విషయాల గురించి చర్చించారనేది వెల్లడించింది. వీటిలో ప్రధానంగా ప్రతి నెల చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో వచ్చే మోదీ ‘మన్కీ బాత్’ కార్యక్రమం ట్విటర్లో టాప్ ట్రెండింగ్లో ఉంది. దీనిపై భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ హ్యాష్ట్యాగ్ మన్కీ బాత్ అని చేసిన ట్వీట్ ఫుల్ వైరల్ గా మారింది. దీనితోపాటు హ్యాష్ట్యాగ్ జల్లికట్టు, జీఎస్టీ(వస్తు, సేవల పన్ను), ముంబయి వరదలు, ముమ్మారు తలాక్ ఈ ఏడాది ట్విటర్ టాప్ ట్రెండింగ్గా నిలిచాయి. ఈ ఏడాది మొదటిలో తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నిర్వహణపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ, ముస్లిం మహిళల పరిరక్షణ కోసం పెట్టిన ట్రిపుల్ తలాక్, డిమోనిటైజేషన్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ఆధార్ హ్యాష్ట్యాగ్లో ట్రెండింగ్లో ఉన్నాయని ట్విట్టర్ తెలిపింది.