లోక్‌సభలో కన్నీటిపర్యంతమైన సుష్మాస్వరాజ్‌

SMTV Desk 2017-12-28 13:54:01  Kulbhushan Jadhav family topic in lokhsabha sushmaswaraj

న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : జాదవ్ కుటుంబసభ్యులపై పాక్ వైఖరి తీరును కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పాక్‌ అమానవీయ తీరును ఉటంకిస్తూ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. సభలోనే కన్నీరు పెట్టుకున్నారు. 21 నెలల తరువాత కుల్‌భూషణ్‌ జాదవ్‌ ను కలిసేందుకు పాక్ వెళ్లిన అతడి తల్లి, భార్యను పాక్ వైఖరి వేధించారని, సూటిపోటి మాటలన్నారని సుష్మా చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా చెప్పులు తీసుకుని ఉండి ఉంటే తిరిగి వెళ్లేప్పుడు ఇచ్చేయాల, కానీ పాక్‌ అలా చేయకుండా క్రూరంగా ప్రవర్తించిందని పాక్‌ తీరును ఆమె దుయ్యబట్టారు.