నేడు పీజేఆర్ 10వ వర్థంతి

SMTV Desk 2017-12-28 12:01:29  Congress leader P.Janardan Reddy (PJR)10th Memorial to day

హైదరాబాద్, డిసెంబర్ 28 : నేడు దివంగత కాంగ్రెస్ పార్టీ నేత పి.జనార్దన్‌రెడ్డి పదో వర్థంతి కావడంతో, ఆయన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌ చౌరస్తాలో ఉన్న పీజేఆర్‌ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పూలమాలలు వేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పేద, బడుగు వర్గాల ప్రజల కోసం పోరాడిన తన తండ్రి పీజేఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.