ఫైబర్‌ నెట్‌ ఒక గొప్ప ప్రాజెక్ట్ : రాష్ట్రపతి

SMTV Desk 2017-12-27 18:20:40  RAM NATH KOVIND, PRESIDENT, AP FIBER NET, AP CM CHANDRA BABU NAIDU

అమరావతి, డిసెంబర్ 27 : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏపీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”సాంకేతికతను వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుంది. ఫైబర్‌ నెట్‌ లాంటి గొప్ప ప్రాజెక్టును ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అభినందనలు. టెక్నాలజీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఫైబర్‌ నెట్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని సేవలును విస్తృతంగా అందించవచ్చు” అని వెల్లడించారు.