ముంబై, డిసెంబర్ 27 : భారత్ స్టార్ క్రికెటర్ ధోని ‘రన్ అడమ్’ అనే స్పోర్ట్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఆ సంస్థ కొత్త ఏడాది కోసం ఓ యాడ్ చేయాలని భావించి డైరెక్టర్ జీవా శంకర్తో సంప్రదింపులు జరిపింది. తాజాగా ఈ యాడ్ షూటింగ్ ముంబయిలో జరిగింది. దర్శకుడు శంకర్ షూటింగ్లో ధోనితో జరిగిన అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..” ధోని అంటే నాకు చాలా ఇష్టం. అతనితో షూటింగ్ సమయంలో నేను కొంత ఇబ్బంది పడ్డాను. కానీ ధోని నాకు చాలా ప్రోత్సాహం అందించారు. మా మధ్య చర్చలో ధోని రజనీకాంత్ గురించే మాట్లాడారు. అంతే కాకుండా ఆయన గడిపే నిరాడంబర జీవితం తనకెంతో నచ్చుతుందని ధోని చెప్పారు. అలాగే సూర్య నటించిన సినిమాలంటే ఇష్టమని, సబ్టైటిల్స్తో తమిళ సినిమాలు చూస్తానని ధోనీ వెల్లడించారు” అని శంకర్ తెలిపారు