కర్నూలు, డిసెంబర్ 27 : చెన్నంపల్లి కోటలో నిధి నిక్షేపాలు ఉన్నాయని గత 14 రోజుల నుండి ఎపి పురావస్తు, మైనింగ్ శాఖ అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసిందే. తవ్వకాల మొదట్లో అస్తిపంజరాలు, ఎనుగుదంతాలతో పాటు తదితర వస్తువులు లభ్యమయ్యాయి. ఇప్పుడు రెండు సొరంగాలు బయట పడ్డాయి. అయితే ఈ సొరంగాలు ఎంత వరకు ఉన్నాయనే విషయాన్ని నిర్దారించాలేమన్న అధికారులు, కోటలోని భూగర్భంలో మాత్రం మెటల్ ఉన్న మాట నిజమేనని దాన్ని కనుగొనడమే లక్ష్యమని ఉద్ఘాటిస్తున్నారు.