అనంతపురం, డిసెంబర్ 26: ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి అనంతపురానికి వెళ్తుండగా కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలని, కారు ఆపమని ఆయన తన డ్రైవర్కు సూచించారు. దీంతో డ్రైవర్ ఒక్కసారి కారు నిలపడంతో కాన్వాయ్లోని మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ వాహన శ్రేణి ప్రమాదంలో మంత్రి దేవినేనితో పాటు అందరు సురక్షితంగా బయటపడ్డారు.