న్యూఢిల్లీ, డిసెంబర్ 26 : భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను సోమవారం ఇస్లామాబాద్లో తల్లి అవంతి, భార్య చేతన్కుల్లు కలిసిన విషయం తెలిసిందే. అయితే స్వేచ్ఛాయుత వాతావరణంలో వీరి సమావేశం జరగలేదు. ఎన్నో షరతుల మధ్య పాక్ అధికారులు వీరి మధ్య భేటిని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఇస్లామాబాద్ చేరుకున్నాక కుల్భూషణ్ను కలవడానికి ముందు అక్కడి అధికారులు చేతన్కుల్ నుంచి చెప్పులు తీసుకున్నారట. అంతేకాకుండా మంగళసూత్రం, నుదుటన బొట్టు తొలగించాల్సిందిగా డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కుల్భూషణ్తో మాతృభాషలో మాట్లాడనివ్వలేదని ఆయన్ని కలిసే ముందు దుస్తులు మార్చుకోవాల్సిందిగా బలవంతం చేశారని తెలుస్తుంది.