పోర్ట్ ఎలిజిబెత్, డిసెంబర్ 26: దక్షిణాఫ్రికా- జింబాబ్వేల మధ్య జరుగుతున్న నాలుగు రోజుల ఏకైక డే/నైట్ టెస్ట్ మ్యాచ్ కు సఫారీ సారధి డుప్లెసిస్ దూరమయ్యాడు. అతని స్థానంలో ఈ టెస్ట్ మ్యాచ్ కు ఏబీ డివిలియర్స్ కెప్టెన్ గా భాద్యతలు చేపట్టనున్నాడు. "గత వారం నుండి భుజం గాయంతో బాధపడుతున్న డుప్లెసిస్కు వైరల్ ఇన్ఫెక్షన్ సోకింది. అతను కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. తదుపరి భారత్ తో కఠిన సిరీస్ లకు డుప్లెసిస్ జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నాం" అని జట్టు మేనేజర్ మొహ్మద్ ముసాజే వెల్లడించారు. కాగా దాదాపు రెండేళ్లు టెస్టు క్రికెట్కు దూరమైన ఏబీ డివిలియర్స్ మ్యాచ్ తో బరిలోకి దిగుతున్నాడు.