రైల్వేస్టేషన్‌కు నిప్పంట్టించిన గుర్తుతెలియని వ్యక్తులు...

SMTV Desk 2017-12-26 16:28:48  Guntur District Kollakuru Railway Station Thugs fired

గుంటూరు, డిసెంబర్ 26 : నేడు తెల్లవారుజామున 5 గంటల సమయంలో గుంటూరు జిల్లా కొలకలూరు రైల్వేస్టేషన్‌కు గుర్తుతెలియని దుండగులు వచ్చి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో కౌంటర్‌లోని కొన్ని రికార్డులు, ఫర్నీచర్‌ దగ్ధమయ్యాయి. అదే సమయంలో కౌంటర్‌ వద్ద విధులు నిర్వహించేందుకు వచ్చిన శ్రీలక్ష్మి అనే ఉద్యోగిని మంటలను అదుపుచేసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీఎఫ్‌ పోలీసులు అక్కడికి చేరుకుని ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. తగులబెట్టిన ప్రాంతంలో మద్యం సీసాలతో పాటు ఓ వర్గానికి చెందిన జెండాలు ఉన్నాయని రైల్వే ఎస్‌ వెంకటయ్య వెల్లడించారు.