దేశ రాజదానిలో నీటి పన్నుభారం...

SMTV Desk 2017-12-26 16:18:14  Water tax, Arvind Kejriwal, delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: దేశ రాజదాని ఢిల్లీ నగరవాసులకు ఓ కొత్త సమస్య వచ్చి పడింది. ఇకపై ఇంటికి నెలకు 20వేల లీటర్ల నీటి వినియోగ పరిమితి మించితే, 20శాతం పన్ను చెల్లించక తప్పదు. నీటి వినియోగంపై పన్నులు పెంపు నిర్ణయానికి జల్‌బోర్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2018 నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి రానుంది.