మంచిర్యాల, డిసెంబర్ 26 : తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ-లంబాడీల సమస్య పరిష్కార౦పై జాప్యం చేస్తుందని జిల్లాలో ఆదివాసులు మరో సారి రెచ్చిపోయారు. కొత్తపేట తండా పై ఆదివాసులు దాడి చేసి గుడిసెలకు నిప్పు అంటించి నానా బీభత్సం సృష్టించారు. పరిస్థితి తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకొని ఆందోళనకారులను నియంత్రించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీగా బలగాలను మొహరించారు.