సుష్మాస్వరాజ్‌తో భేటి అయిన కుల్‌భూషణ్‌ కుటుంబ సభ్యులు

SMTV Desk 2017-12-26 14:42:16  kul bhushan jadhav, family, sushma swaraj, new delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ తల్లి అవంతి, భార్య చేతన్‌కుల్‌ భారత్ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటి అయ్యారు. వీరితో పాటు పాకిస్థాన్‌లో భారత హై కమిషనర్ జే పీ సింగ్, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. కాగా ఈ సమావేశం రహస్యంగా జరగడం గమనార్హం. గూఢచర్య ఆరోపణలను ఎదుర్కొని పాక్‌ జైల్లో ఉంటున్నభారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ను, నిన్న చేతన్‌కుల్‌, అవంతిలు ఇస్లామాబాద్‌లో కలిసి అరగంట పాటు మాట్లాడిన విషయం తెలిసిందే. కుల్ భూషణ్ అరెస్టయిన 21 నెలల తర్వాత కుటుంబసభ్యులతో మాట్లాడటం ఇదే తొలిసారి. సోమవారం మధ్యాహ్నం పాకిస్థాన్‌లో కుల్ భూషణ్ జాదవ్‌తో జరిగిన సమావేశం వివరాలను అవంతిక, చేతన సుష్మాకు వివరించినట్లు సమాచారం. అంతే కాకుండా కుల్‌భూషణ్‌ను ఎలాగైనా విడిపించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.