మెల్బోర్న్, డిసెంబర్ 26 : భారత్ క్రికెట్ సారధి, రన్ మెషీన్ కోహ్లీ వరుసగా ప్రపంచ క్రికెట్ రికార్డులను బద్దలగోట్టుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే కోహ్లి (20) ఇప్పటివరకూ సాధించిన టెస్టు శతకాలను, ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ దాటేశాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో వార్నర్ (103) సాధించి, తన టెస్టు సెంచరీలను 21కు పెంచుకున్నాడు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్మిత్ సేన తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 244 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. క్రీజులో స్మిత్ (65), షాన్ మార్ష్ (31) ఉన్నారు.