భువనేశ్వర్, డిసెంబర్ 26: నాలుగేళ్ళ చిన్నారి మృత్యువుతో పోరాడి సురక్షితంగా బయటపడింది. ఒడిశాలోని అనుగుల్ జిల్లా కిశోర్నగర్ సమితి గులసరొ గ్రామంలో చిన్నారి రాధ ఆడుకుంటూ అక్కడ పక్కన ఉన్న 100 అడుగుల లోతు గల బోరు బావిలో పడింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఓడ్రాఫ్ సిబ్బంది, 6 గంటల పాటు శ్రమించి బోరు పక్కన తవ్వకాలు జరిపి బాలికను కాపాడారు. ఆ బాలిక 20 అడుగుల లోతులో చిక్కుకుందని వారు తెలిపారు. అనంతర౦ వెంటనే చిన్నారిని అనుగుల్ ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. బాలికను కాపాడిన సిబ్బందిని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించారు.