అనకాపల్లి, డిసెంబర్ 25: ఓ హిజ్రాను సజీవదహనం చేసేశారు. విశాఖలోని అనకాపల్లి పట్టణంలో గాంధీనగరం వీధిలో దేవుడమ్మ (కాలపర్తి వెంకట సూర్యనారాయణ) అనే హిజ్రా నివసిస్తూ ఉండేది. ఆమె వెంకటేశ్వరస్వామి భక్తురాలు. దేవుడమ్మ, ఆమె వద్దకు వచ్చే భక్తులకు వారి గ్రహస్థితిని గురించి తెలుపుతూ వారి నుంచి డబ్బు తీసుకునేది. భక్తులకి అన్నప్రసాదం కూడా పెడుతుండేది. గత కొద్ది రోజులుగా దేవుడమ్మకు తోటి హిజ్రాలతో విభేదాలు వచ్చాయి. అలాంటి సమయంలో తన ఇంట్లో మంటల్లో కాలిపోతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినా లాభం లేకపోయింది. దేవు డమ్మ మృతిని అనుమాన స్పదంగా గుర్తించి పోలీసులు అనేక కోణాలలో విచారిస్తున్నారు. ఆమెకి షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని కొందరు అంటోంటే, కొందరు దుండగులు సదరు హిజ్రాను హత్య చేసినట్లు అంటున్నారు.