న్యూఢిల్లీ, డిసెంబర్ 25 : భారతీయ రైల్వే లో టీటీఈ (ట్రెయిన్ టికెట్ ఎగ్జామినర్లు)లు సరికొత్త యూనిఫారాల్లో దర్శనమివ్వనున్నారు. ఇంతవరకు నలుపు, తెలుపు కాంబినేషన్ లో ఉన్న టీటీఈ డ్రెస్ కు స్వస్తి పలకనున్నారు. ఇకనుంచి బూడిద రంగు(గ్రే) సూటు, తెల్లని షర్టు, ఎర్రటి టై ధరిస్తారు. అంతే కాకుండా వారి సూటుకున్న ఓ జేబు వద్ద ‘భారతీయ రైల్వే’ లోగో ఉంటుంది. తొలుత దురంతో, శతాబ్ది, రాజధాని వంటి ప్రధాన రైళ్లలో ఈ యూనిఫారాల విధానం అమలు చేపట్టక మిగిలిన అన్ని ట్రెయిన్లలోనూ టీటీఈలూ ఇదే తరహా దుస్తులు ధరిస్తారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రధాన రైళ్లలో టీటీఈల కొత్త యూనిఫారాల గురించి అన్ని జోన్ల జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డు తెలియచేసింది.