కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థి పదవి చోటు ఎవరికీ?

SMTV Desk 2017-12-25 16:06:52  Kurnool district MLA is a candidate for local, ap cm chandrababu naidu

అమరావతి, డిసెంబర్ 25 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు నేతలతో భేటీ అయ్యారు. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానానికి భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ నెల 26న నామినేషన్‌ గడువు ముగుస్తుండటంతో అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలన్న అంశంపై ప్రస్తుతం సీనియర్‌ నేతలు, కర్నూలు జిల్లా పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. టికెట్‌ ఆశిస్తున్న కేఈ ప్రభాకర్‌, ఎం.శివానందరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డిలో ఎవరిని ఎంపిక చేస్తారోనని, అందరు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఓ వైపు ఎమ్మెల్సీ పదవిని కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన వారికే ఇవ్వాలని, మరోవైపు గతంలో ప్రాతినిధ్యం వహించిన సామాజిక వర్గానికే ఇవ్వాలని పట్టుబడుతుండగా, మరీ ఎవరికీ ఈ పదవి దక్కనుందో వేచ్చిచుడాలి.