మెజంటా లైన్‌లో మెట్రో కు ప్రారంభించిన ప్రధాని మోదీ...

SMTV Desk 2017-12-25 15:46:26  Modi is the prime minister opened the metro delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 25 : ఢిల్లీ వాసులకు క్రిస్మస్ కానుకగా నేడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో రైలు నెట్‌వర్క్‌లోని మెజెంటా లైన్‌ను ప్రారంభించారు. దేశ రాజధానిని నోయిడాతో ఈ మార్గం కలుపుతోంది. 12.6 కి.మీ పొడవైన ఈ మార్గం దక్షిణ ఢిల్లీలోని కల్‌కాజీ నుంచి నోయిడాలోని బొటానికల్‌ గార్డెన్‌ వరకూ ఉంది. అయితే, ఈ ఏడాది మొత్తంలో మోదీ చేతులమీదుగా మూడు మెట్రోలను ప్రారంభించారు. జూన్‌లో కొచ్చి మెట్రోను జాతికి అంకితం చేయగా, నవంబర్‌లో హైదరాబాద్‌ మెట్రోను ఆవిష్కరించారు. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలోని మరో మార్గాన్ని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చారు. కాగా, ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆహ్వనించలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమానికి మోదీతోపాటు హాజరయ్యారు. దీనిపై ఆప్‌ నేతలు మండిపడ్డారు. రాజకీయ విబేధాల కారణంగానే కేజ్రీవాల్‌ను ఈ కార్యక్రమానికి పిలవలేదని దుయ్యబట్టారు.