వరుస ప్రమాదాల్లో చిక్కుకున్న ఫిలిప్పీన్స్‌

SMTV Desk 2017-12-25 14:48:13  Philippines, Catholic church, bus accident

మనీలా, డిసెంబర్ 25 : మొన్న ‘టెంబిన్‌’ తుపాను, నిన్న ఎన్సీసీ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం మరువక ముందే ఫిలిప్పీన్స్‌లో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్‌ వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై, 20 మంది దుర్మరణం పొందారు. ఆగో నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మనావోగ్‌ ప్రాంతంలోని ఓ కేథలిక్‌ చర్చికి హజరయ్యేందుకు ఓ కుటుంబం బస్సులో వెళ్తొంది. ఆగో ప్రాంతంలో ఈ బస్సు ప్రమాదవశాత్తు మరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 26 మంది గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, దక్షిణ ఫిలిప్పీన్స్‌లో చోటుచేసుకున్న తుఫాను కారణంగా ఇప్పటికే 200 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో 37 బలైయ్యారు.