కాసులు తేలేదని ఇంటిని కాల్చేశాడు...

SMTV Desk 2017-12-25 13:32:21  Dowry, crime, tiruvuru, krishna district

తిరువూరు, డిసెంబర్ 25: సమాజంలో వరకట్న వేదింపులు నాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ వరకట్న పిశాచి, డబ్బులు తీసుకురాట్లేదని తన భార్యపై కోపంతో ఇంటికే నిప్పు అంటిచాడు. ఈ ఘటన కృష్ణ జిల్లా తిరువూరు మండలంలోని కోకిలంపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కొత్తపల్లి భరతకుమార్‌,తన సోదరుడు రంజిత్‌కుమార్‌ ప్రోద్బలంతో తరచూ అదనపు కట్నం తెమ్మంటూ భార్య వరకుమారిని వేధించసాగాడు. దీనిలో భాగంగా ఇటీవల రూ.50 వేలు తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా హింసిస్తూన్నాడు. ఈ మధ్య పుట్టింటికి వెళ్లిన భార్య డబ్బులు తేలేదనే కోపంతో ఇంటికి నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయిందని పోలీసులు తెలిపారు. భార్య వరకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.