అమరావతి, డిసెంబర్ 25 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఖరారు చేయనున్నారు. అయితే, ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సమయంలో రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీలో ఆశావాహుల సంఖ్య అధికంగానే ఉంది. అభ్యర్ధి ఎంపిక కోసం ఇప్పటికే రెండు దఫాలుగా జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహించినా ఓ కొలిక్కి రాలేదు. కాగా, ఆదివారం సీఎం ఈ మేరకు కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. కానీ అభ్యర్ధి ఎంపికపై స్పష్టత రాకపోవడంతో మళ్లీ, నేడు మరోసారి కర్నూలు జిల్లా నేతలతో సమావేశం నిర్వహించి అభ్యర్ధిని ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం.