ముంబాయి, డిసెంబర్ 24 : భారత్- శ్రీలంక మధ్య ముంబై వేదికగా జరగనున్న చివరి టీ-20 మ్యాచ్ లో రోహిత్ సేన టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకొంది. కాగా ఈ మ్యాచ్ లో భారత్ తరపున వాషింగ్టన్ సుందర్ టీ-20 లో అరంగేట్రం చేయనున్నాడు. అంతే కాకుండా హైదరాబాద్ యువ కిరణం మొహ్మద్ సిరాజ్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకొన్నాడు. శ్రీలంక జట్టులో మాథ్యూస్ మజిల్స్ పట్టుకోవడంతో మ్యాచ్కు దూరమయ్యాడు. మూడు టీ-20 ల ఈ సిరీస్ లో భారత్ జట్టు 2-0 తో ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.