ఆర్కేనగర్ దినకరన్‌ వశం...

SMTV Desk 2017-12-24 17:34:23  rk nagar, dhinakaran won, sashikala nephew, ttv ,

చెన్నై, డిసెంబర్ 24 : ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ మేనల్లుడు టిటివి దినకరన్‌ 40,707 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోలైన ఓట్లలో 50.32 శాతం దినకరన్‌ పొందినవే. ఆది నుండి ఆధ్యికంలో కొనసాగుతున్న దినకరన్‌ ప్రతి రౌండ్ లోను దూసుకుపోయారు. అధికార అన్నాడీఎంకే పార్టీకి చెందిన మధుసూదనన్ 48,306 ఓట్లతో రెండవ రెండో స్థానంలో నిలవగా, డీఎంకే అభ్యర్థి మురుదు గణేష్‌ 24,651 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. డబ్బులు పంచి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే కారణంతో ఎన్నికల సంఘం ఇది వరకే ఒకసారి ఆర్కేనగర్ ఉప ఎన్నికను వాయిదా వేసింది. కాగా, ఈ ఎన్నికల్లో దినకరన్ గెలుపొందడంతో తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది. మరో మూడు నెలల్లో ఓపీఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తానని దినకరన్ ఇప్పటికే హెచ్చరించడం గమనార్హం. దినకరన్ విజయంతో ఆయన వర్గం సంబరాలు చేసుకుంటోంది.