స్కార్పియో ఆటో ఢీ.. ఇద్దరు మృతి..

SMTV Desk 2017-12-24 16:07:41  road accident, crime, west godavari,

పశ్చిమ గోదావరి, డిసెంబర్ 24: వేగం కన్నా.. ప్రాణం మిన్నా అంటుంటారు. కానీ ఇక్కడ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మితిమీరిన వేగంతో వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి ఆటోను, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం భీమడోలు మండలం కురెళ్లగూడెం వద్ద 16వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడేళ్ల బాలుడితో పాటు ఓ వ్యక్తి మృతి చెందగా 18 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే వీరాంజనేయులు క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించారు.