శంషాబాద్ రూరల్, జూన్ 18 : తెలంగాణ రాష్ట్ర భూ కుంభకోణంలో ‘కేసీఆర్ ఈ రోజు.. గోల్డ్ తెలంగాణను గోల్డ్ స్టోన్ ప్రసాద్కు అప్పగించావు, అంటూ తెలంగాణ సమాజం ముందు కేసీఆర్ ముద్దాయిగా నిలబడాల్సిందేనని, కేసీఆర్కు గజ్వేల్లో గజం భూమి పోలేదేమో గానీ.. ఇక్కడ పేదోళ్ల భూములు వందల ఎకరాలు అన్యాక్రాంత మయ్యయంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాంసిమియాగూడలో గోల్డ్స్టోన్ ప్రసాద్ అక్రమంగా కాజేసిన ప్రభుత్వ భూములను శనివారం రోజున టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి చేత నాగలి పట్టి భూములను దున్నించారు. రాజధాని, శివారు ప్రాంతాల్లో జరిగిన భూ కుంభకోణాల్లో సీఎం కేసీఆర్ రోజు కోమాట మాట్లాడుతున్నారని ఆయన వెల్లడించారు. మియాపూర్లో దాదాపు 700 ఎకరాలను పరిశీలిస్తే ఇప్పటికీ ఆ భూములు గోల్డ్స్టోన్ ప్రసాద్ ఆధీనం లోనే ఉన్నాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేశవరావు, కుటుంబ సభ్యులు ఈ భూముల్లో భూమిపూజ చేసినట్లు వెల్లడైనా అలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెపారు. భూకుంభ కోణంలో నిందితులైన ట్రినిటీ కంపెనీ డైరక్టర్ పార్థసారథి, శర్మను అరెస్టు చేసి జైలుకు పంపిన ప్రభుత్వం వారికి బెయిల్ రాకుండా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాలేదన్నారు. గోల్డ్ స్టోన్ప్రసాద్ మరదలు సీఎం కార్యాలయం అధికారిగా ఉంటూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను నిర్వహిస్తుండగా.. ఆమెపై చర్యలు తీసుకోకపోగా.. సబ్రిజిస్ట్రార్లను అరెస్టు చేసి జైలుకు పంపడం ఏమిటని ప్రశ్నిం చారు. అవినీతికి పాల్పడ్డారంటూ డాక్టర్ రాజ య్యను దళితబిడ్డ మంత్రివర్గం నుంచి తొలగించిన కేసీఆర్.. రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న ఉపముఖ్య మంత్రిపై మాత్రం చర్యలు ఎందుకు తీసుకోవడంలేదన్నారు. ఎంపీ డి.శ్రీనివాస్ అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు పత్రికల్లో వార్తలు వస్తే ఆయన నుంచి కనీసం వివరణ కూడా అడగలేదన్నారు. సీఎం కార్యాలయ సిబ్బం ది, ఎంపీలు, ఎమ్మెల్యేలు భూ కుంభకోణంలో కూరుకుపోయారని రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ నేరస్తుడు నయీం పోలీ సులకు దొరుకుతాడు కాని గోల్డ్స్టోన్ ప్రసాద్ దొర కడా? అతని కోసం దేశమంతా వెతుకుతున్నారు కానీ సీఎం ఫాంహౌస్లో దాక్కున్నా డేమో చూ శారా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా భూకుంభకోణాల అక్రమాలను వెలికి తీసేం దుకు సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు భూ ఆక్రమిత చట్టాన్ని పటిష్టం చేయాలని టీటీడీపీ రాష్ట్ర అధ్య క్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో ఆ పార్ట నేతలు అరవింద్కుమార్గౌడ్, రావుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలోని ప్రతి అడుగు స్థలం విలువైనదేనని, ఈ భూముల పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని వెల్లడించారు.