లాలూకు జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు!

SMTV Desk 2017-12-24 13:10:38  RJD chief Lalu Prasad Yadav, paper, TV, Nets,Meals in PreparationsBirsamundasell

పట్నా, డిసెంబర్ 24 : ప్రస్తుతం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోసం రాంచీలోని బిర్సాముందాజైలులో వార్తపత్రిక, టీవీ, దోమతెర, ఇంటి భోజనం వంటి సౌకర్యాలు కల్పించారు. దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ దోషిగా తేలిన విషయం తెలిసిందే. 20 ఏళ్ల నాటి దాణా కుంభకోణం కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనతో పాటు మరో 15 మందిని దోషులుగా తేల్చింది. దీంతో లాలూ ఇక్కడి జైల్లో ఉన్నంత వరకు ఇతర ఖైదీలు ఆయన సెల్‌లోకి వెళ్లడానికి, కలవడానికి అనుమతి లేదు. దాణా కేసులో లాలూ 2013లో అరెస్ట్‌ అయినప్పుడు కూడా ఇదే సెల్‌లో ఉన్నారు. ఆ సమయంలో లాలూకు గుండె శస్త్రచికిత్స జరిగింది. అప్పటినుంచి ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, ఆయనతో పాటు మరో 15 మందికి జనవరి 3న దోషులకు న్యాయస్థానం శిక్షలు ఖరారు చేయనుంది.