క్రైస్తవ బంధువులందరికీ వందనాలు :కేసిఆర్

SMTV Desk 2017-12-24 13:03:42  christmas, kcr, christmas celebrations at nizam college grouds.

హైదరాబాద్, డిసెంబర్ 24: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో క్రిస్మస్‌ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ... క్రైస్తవ బంధువులకు వందనాలు. వచ్చే ఏడాది వరకు క్రిస్టియన్ భవన్ పూర్తవుతుందన్నారు. పాత చర్చిల మరమ్మతులు, చర్చిల నిర్మాణానికి పది కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. క్రిస్మస్ వేడుకలు అధికారికంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం చిన్నారులకు బట్టలు పంపిణీ చేసి, తర్వాత క్రిస్మస్ కేక్‌ను చిన్నారులతో కట్‌ చేయించి పంచిపెట్టారు. నిరుపేద క్రిస్టియన్లకు బహుమతులను పంపిణీ చేశారు.