విజయవాడ, డిసెంబర్ 24: కృష్ణ-గుంటూరు జిల్లాల ఆశాకిరణం.. రైతుల పాలిట ఆశాదీపమైన ప్రకాశం బ్యారేజీకి 60 వసంతాలు నిండాయి. ఈ బ్యారేజీ సాగునీరు, త్రాగు నీరును అందిస్తూ తెలుగు నేలను సస్యశ్యామలం చేస్తుంది. నేడు బ్యారేజీ నిర్మించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ.. ఈ నెల 29న ప్రకాశం బ్యారేజీ షష్ఠిపూర్తి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13.5లక్షల ఎకరాలకు ప్రకాశం బ్యారేజీ తాగునీరు అందిస్తోందన్నారు.