శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి కోవింద్ రాక...

SMTV Desk 2017-12-24 12:45:51  India president ramnath kovindh, bollaram president house, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 24 : శీతాకాల విడిదిలో భాగంగా నేడు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ కు ఘనస్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరురాష్ట్రాల గవర్నర్ నరసింహన్, పలురువు నేతలు, తదితరులు హఖీం పేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇప్పటికే కోవింద్ విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ముస్తాబైంది. రాత్రి రాష్ట్రపతి నిలయం ఆయనకు విందు ఏర్పాటు చేయనున్నారు. ఆయన ఇక్కడ నాలుగు రోజులు బస చేసిన అనంతరం ఈ నెల 27న అమరావతికి వెళ్లనున్నారు.