అర్కేనగర్, డిసెంబర్ 24: అర్కేనగర్ ఉప ఎన్నికల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఉదయం 8గంటలకే ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో శశికళ మేనేల్లుడు టిటివి దినకరన్ తన సమీప ప్రత్యర్థి మధుసూదనన్ పై పై 10వేల ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. దినరకన్ గెలుపు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో దినకరన్, అన్నాడీఎంకే ఏజంట్ల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో కౌంటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. పారా మిలిటరీ దళాల పహారా నడుమ ఉప ఎన్నిక ఫలితాల కౌంటింగ్ తిరిగి ప్రారంభించారు. ఇప్పటికే శశికళ వర్గీయులు సిఎం పదవిని దినకరన్ కు అప్పగించాలంటూ నినదిస్తూ... స్వీట్లు పంచుతూ.. సంబరాలు జరుపుకుంటున్నారు.