సఫారీ పర్య‌ట‌న‌కు భారత వన్డే జట్టు ఇదే..

SMTV Desk 2017-12-23 21:41:08  india, team, south africa tour, odi team, bcci

ముంబయి, డిసెంబర్ 23: వచ్చే ఏడాది జనవరిలో భారత్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా కోహ్లి సేన సఫారీలతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ-20 లు ఆడనుంది. ఇందుకోసం 17 మందితో కూడిన భారత్ వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ కేదార్‌జాద‌వ్‌, బౌల‌ర్ శార్దూల్ ఠాకూర్‌కు తాజా జ‌ట్టులో చోటు ద‌క్కింది. అశ్విన్‌, జ‌డేజా కు మళ్లీ సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. ఫిబ్రవరిలో ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగే ఆరు వ‌న్డేల సిరీస్‌లో ఈ జ‌ట్టు పోరాడనుంది. జట్టు వివరాలు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌పాండే, కేదార్‌ జాదవ్‌, దినేష్‌ కార్తీక్‌, ఎంఎస్‌ ధోనీ(వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ పాండ్య, మహ్మద్‌ షమి, శార్దూల్‌ ఠాకూర్‌