ముంబై, డిసెంబర్ 23 : వచ్చే ఏడాది వేసవిలో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు భారత్లో అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్ జట్టు టీమిండియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత భారత్-ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ జరగనుంది. మార్చి 12 నుంచి భారత్-ఆస్ట్రేలియాల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. అంతక ముందు పర్యాటక జట్టు భారత్-ఎతో మార్చి 6, 8న జరిగే రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది.ముక్కోణపు టీ20 మ్యాచ్లకూ ముంబయి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు బీసీసీఐ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను వెల్లడించింది.