జైపూర్, డిసెంబర్ 23: దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ జిల్లాలో ఓ ప్రయివేటు బస్సు దుబి వద్ద బనస్ నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 32, మంది మృత్యు వాత పడగా, పలువురు గాయపడ్డారు. ఘటన సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానిక వర్గాల సమాచార ప్రకారం... ఈ ప్రమాదానికి గల కారణం బస్సును నడిపిన ఓ మైనర్ అబ్బాయి అని అంటున్నారు. 16 ఏళ్ళు వయసు కలిగిన బాలుడు బస్సుకు కండక్టర్గా వచ్చబస్సును నడిపినట్లు తెలుస్తోంది వంతెనపై మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతుండగా బస్సు అదుపుతప్పి వంతెన గోడను ఢీకొట్టి నదిలోకి పడిపోయిందని స్థానికులు తెలిపారు.