విశాఖలో జేసీబీ వాహనానికి నిప్పుపెట్టిన మావోలు..!

SMTV Desk 2017-12-23 12:07:49  vishakhapatnam, maoist, jcb, fire, road

విశాఖ, డిసెంబర్ 23: విశాఖ జిల్లాలో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. జిల్లాలోని జీకే వీధి మండలంలో శనివారం ఓ జేసీబీని దగ్ధం చేశారు. స్థానికంగా రోడ్డు పనులు జరుగుతు౦డగా వాటిని అడ్డుకునేందుకు మావోయిస్టులు పలుసార్లు యత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న జేసీబీకి, ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. కొంతకాలంగా ఈ రహదారి నిర్మాణాన్ని మావోలు వ్యతిరేకిస్తు౦డగా భద్రతా దళాల పర్యవేక్షణలో రహదారి నిర్మాణం జరుగుతోంది. అక్కడ భద్రతా సిబ్బంది లేని సమయంలో మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టామని, అటవీ ప్రాంతంలో కూంబింగ్ వేగవంతం చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఇటీవలే భద్రాచలం అడవుల్లో పోలీసులు, మావోల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగి పలువురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.