పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌..

SMTV Desk 2017-12-23 11:51:15  Rayalaseema Express, Nizamabad, KAMAREDDY,

కామారెడ్డి, డిసెంబర్ 23: నిజామాబాద్ జిల్లాలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. వివరాలిలా ఉన్నాయి.. దరిపల్లి మండలం చిన్నాపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో తిరుపతి నుంచి నిజామాబాద్‌ వెళుతున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ శనివారం ఉదయం పట్టాలు తప్పింది. దీంతో ఇంజిన్‌, మరో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మరమ్మత్తు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది.