జైపూర్, డిసెంబర్ 23: రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సవాయి మధోపూర్లోని దుబి వద్ద శనివారం ఉదయం, ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 24 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.