భారత్‌-చైనా చర్చలు ప్రారంభం...

SMTV Desk 2017-12-22 16:13:54  india-chaina boarder talk, doklam, delhi,

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఢిల్లీ వేదికగా భారత్‌-చైనాల మధ్య సరిహద్దు చర్చలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. దోక్లాం వివాదం తరువాత తొలిసారి ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య 20వ విడత చర్చలు కొనసాగుతున్నాయి. నేడు సాయంత్రం వరకు కొనసాగే ఈ సమావేశంలో భారత్‌-చైనా సరిహద్దులో శాంతి, సౌభ్రాతృత్వం కోసం అనుసరించాల్సిన మార్గాలపైచర్చలు జరగనున్నాయి. భారత జాతీయ భద్రత సలహాదారుడు అజిత్‌ డోభాల్‌, చైనా స్టేట్‌ కౌన్సిలర్‌ యాంగ్‌ జియెచి సహా ఇతర ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.