క్రికెటర్లు అంతా క్షేమం : క్రికెట్ బోర్డు

SMTV Desk 2017-12-22 15:07:23  ashes series, England, Australia, melboarn.

మెల్‌బోర్న్‌, డిసెంబర్ 22 : డిసెంబర్ 26 నుండి ఆసిస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ లో భాగంగా నాలుగో టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ జట్టు ప్రస్తుతం ఆసీస్‌లో పర్యటిస్తోంది. ఇదిలా ఉండగా అత్యంత రద్దీగా ఉండే మెల్‌బోర్న్‌ ప్రధాన రహదారిపై ఓ కారు భీభత్సం సృష్టించింది. ఈ దాడిలో 14 మంది గాయపడగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలే ఆ ప్రాంతంలో బ్రిటిష్ ఆటగాళ్లు ఉన్నారు. ప్రమాదం జరిగింది కూడా అదే ప్రాంతం కావడంతో.. ఇంగ్లాండ్‌ అభిమానులు కాస్త ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న క్రికెట్ బోర్డు నిర్వాహకులు.. ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌ సిబ్బంది క్షేమంగానే ఉన్నారని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా ఓ ఇద్దరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.