ముంబయి, డిసెంబర్ 22 : టీవీ కార్యక్రమాల్లో ఎస్సీల గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టిలపై ముంబయి, ఢిల్లీ కోర్టులలో కేసులు నమోదయ్యాయి. సల్మాన్ నటించిన ‘టైగర్ జిందా హై’ ప్రచార కార్యక్రమం నిమిత్తం శిల్పా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ఓ డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఓ జట్టు చేసిన డ్యాన్స్ గురించి మాట్లాడుతూ.. ‘భాంగి’ (మైనార్టీ వర్గానికి చెందిన వారు)లా ఉందంటూ సల్మాన్, శిల్పా కామెంట్స్ చేశారు. దాంతో సల్మాన్, శిల్పా ఎస్సీల మనోభావాలను కించపరిచారని వారిపై యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐఅండ్బీ శాఖ, ఢిల్లీ, ముంబయి పోలీస్ కమిషనర్లు వారం లోపు వివరణ ఇవ్వాలని ఎన్సీఎస్సీ(నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ) ఆదేశాలు జారీ చేసింది.