టాస్ గెలిస్తే ఫీల్డింగ్ బెటర్ : క్యూరేటర్‌

SMTV Desk 2017-12-22 12:18:33  samandar sing chowhan, suggestions india, srilanka, indoor stadium, t20 series,

ఇండోర్, డిసెంబర్ 22 : మూడు టీ-20 సిరీస్ లో భాగంగా నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ-20 ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ క్యూరేటర్‌ సమందర్‌ సింగ్‌ చౌహాన్‌ ఇరు జట్లకు ఓ సలహా ఇచ్చారు. టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ ఎంచుకోండి. ఎందుకంటే తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్న జట్టు మొదటి 10 ఓవర్లు వేసే సమయంలో మంచు ప్రభావం ఉండదు. మొదట ఫీల్డింగ్‌ ఎంచుకుంటే వారు తమ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను అదుపు చేయవచ్చు. తద్వారా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇరు జట్ల కెప్టెన్ లకు సూచించారు.