ముంబై, డిసెంబర్ 22 : స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ఆరంభమయ్యాయి. వారాంత౦ కావడం కారణంగా మదుపర్లు ఎక్కువగా కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. దీంతో ప్రారంభం నుండే సూచీలు మంచి లాభాలతోనే ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంతో 33,876 వద్ద ఉండగా, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 10,472 వద్ద ట్రేడ్ అయ్యింది. కాగా స్వల్ప నష్టాల్లో హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా వంటి షేర్లు ఉండగా.. టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, మారుతి సుజుకీ, భారతీ ఎయిర్టెల్ వంటి షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.