సీరిస్ లక్ష్యంగా బరిలోకి భారత్..

SMTV Desk 2017-12-22 10:59:41  2nd T20 Match, india, srilanka, indoor, madhyapradesh.

ఇండోర్, డిసెంబర్ 22 : మూడు టీ-20 సిరీస్ లో భాగంగా తొలి టీ-20 మ్యాచ్ ను శ్రీలంకపై భారత్ జట్టు 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు ఇరుజట్ల మధ్య రెండో టీ-20 ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా సాయంత్రం 7:00 గంటలకు జరగనుంది. ఆది నుండి తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్న భారత్.. ఈ మ్యాచ్ ను గెలిచి సీరిస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న రోహిత్ సేనను నిలువరించడం ప్రస్తుత శ్రీలంకకు శక్తికి మించిన పని. కాని ఈ మ్యాచ్ లో గెలిస్తేనే లంక జట్టు ఆశలు సజీవంగా ఉంటాయి. తొలి మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లతో శ్రీలంక జట్టును చావు దెబ్బ కొట్టింది. ముఖ్యంగా భారత్ స్పిన్ ద్వయ౦ చాహల్, కులదీప్ యాదవ్.. లంక జట్టును ముప్పు తిప్పలు పెట్టారు. కాగా హోల్కర్ స్టేడియంలో భారత్ కు మెరుగైన రికార్డ్ ఉంది. అంతేకాకుండా బౌండరి పరిధి తక్కువగా ఉండడంతో భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంది.