సిమ్లా, డిసెంబర్ 21: హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు గురువారం భాజపా కేంద్ర పరిశీలకులు నిర్మలాసీతారామన్, నరేంద్రసింగ్ తోమర్ సిమ్లాకు వెళ్లారు. హిమాచల్ప్రదేశ్ సీఎంగా జైరామ్ ఠాకూర్ ఎన్నుకునే అవకాశాలు ఉన్నట్లు, ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఆయనకే తమ మద్దతు తెలుపుతున్నట్లు భాజపా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెలువడే అవకాశం ఉంది.