నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‌...

SMTV Desk 2017-12-21 16:46:42  stock market, sensex, loss, nifti.

ముంబై, డిసెంబర్ 21 : జాతీయ, అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకపోవడంతో నేటి దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆది నుండి నెమ్మదిగా సాగిన సూచీలు.. కాస్తంత నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 21 పాయింట్లు కోల్పోయి 33,756 వద్ద స్థిరపడగా, నిఫ్టీ స్వల్పంగా నాలుగు పాయింట్లకు పడిపోయి 10,440 వద్ద ముగిసింది. కాగా హీరోమోటార్స్‌, హిందాల్కో, టాటాస్టీల్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు కాస్తంత లాభపడగా, మహింద్రా, హిందుస్థాన్‌ యునిలివర్‌, మారుతి సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ షేర్లు స్వల్పంగా నష్టాల్లో ముగిశాయి. నేడు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.08గా కొనసాగుతోంది.